చంద్రబాబు పాలనలో పోలీసుల తీరు ప్రమాదకరం: జగన్

AP: చంద్రబాబు పాలనలో పోలీసు యంత్రాంగం తీరు అత్యంత ప్రమాదకర ధోరణిలో ఉందని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆరోపించారు. రాజకీయ అణచివేత, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి పోలీస్‌ వ్యవస్థను వాడుకుంటున్నారని మండిపడ్డారు. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్‌ కేసులో 30 రోజులు దాటినా ఆచూకీ లభించలేదని, మహిళలపై నేరాలకు ఫిర్యాదులున్నా స్పందన లేదని విమర్శించారు. సోషల్‌ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, చిత్రహింసలు పెడుతున్నారని, తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు యూట్యూబర్‌లపై మోపుతున్నారని దుయ్యబట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్