AP: ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన చింతలపూడి బంగారం దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్లో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 4.490 కేజీల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, గతేడాది సెప్టెంబర్ 9న కనకదుర్గ ఫైనాన్స్ హెడ్ ఆఫీసు నుంచి ఆడిట్ చేయడానికి వచ్చిన ఆడిటర్ వడ్లమూడి ఉమా మహేశ్.. ఎవరూ లేని సందర్భంలో 378 కవర్లలోని 4,490 కేజీల బంగారు ఆభరణాలు తీసుకుని పారిపోయాడు.