కొమరోలు: ఎంపీడీవోను కలిసిన స్వచ్ఛభారత్ కార్మికులు

కొమరోలు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సయ్యద్ మస్తాన్ వలిని స్థానిక స్వచ్ఛ భారత్ కార్మికులు మర్యాదపూర్వకంగా కలిశారు. 30 నెలలుగా తమ వేతన బకాయిలు చెల్లించలేదని అప్పులు చేసి మరి తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని స్వచ్ఛభారత్ కార్మికులు ఎంపీడీవోకు తెలిపారు. సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని ఎంపీడీవో కార్మికులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్