సింగరాయకొండ మండలంలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంగళవారం వరకు 37 డిగ్రీల ఎండతో అల్లాడిన ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీ వర్షం పడటంతో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందారు. బలమైన ఈదురు గాలులకు అక్కడక్కడా చెట్లు నేలకొరిగాయి. మూడు రోజులపాటు ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.