కొండేపి: విజిలెన్స్ అధికారుల దాడులు

ప్రకాశం జిల్లా కొండేపి మండలంలో శనివారం విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విద్యుత్ అక్రమ వాడకం దారులపై కేసులు నమోదు చేశారు. ఈ. ఈ నాగేశ్వరరావు నిబంధనలు ఉల్లంఘించిన 89 మంది వినియోగదారులపై కేసులు నమోదు చేసి రూ. 3, 11, 600 నగదును జరిమానాగా విధించామని తెలిపారు. దాడుల్లో మండలంలోని విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడడం నేరమని ఈఈ అన్నారు.

సంబంధిత పోస్ట్