పొదిలి: రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

పొదిలి మండలం పోతవరం గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో మినీ వ్యాన్ ఢీకొని  ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారందరినీ అంబులెన్స్ లో పొదిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలియవలసి ఉందని పోలీసులు అన్నారు.

సంబంధిత పోస్ట్