మార్కాపురంలో గుప్త నిధుల తవ్వకాల అంశంలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని డిఎస్పి నాగరాజు మీడియాకు మంగళవారం వెల్లడించారు. పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని నడిపయ్య, వెంకట్రావు అనే వ్యక్తులు గుప్త నిధులు ఉన్నాయని తవ్వితే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని అతనిని నమ్మబలికి అతని వద్ద నుంచి నగదు వసూలు చేశారని అందుకు సంబంధించిన ఆరుగురిని అదుపులకు తీసుకొని రిమాండ్ కు తరలించారు.