మార్కాపురం మండలం రాజుపాలెం సమీపంలో సోమవారం పట్టపగలే ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరిపై కారం చల్లి, వారి వద్ద ఉన్న రూ. 2.50 లక్షల నగదుతో కూడిన బ్యాగును కారులో వచ్చిన దొంగలు అపహరించుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.