కొత్తపట్నం మండలంలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లుగా విద్యుత్ శాఖ A. E చంద్రకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తపట్నం మండలంలోని విద్యుత్ లైన్ల లో మరమత్తుల దృష్ట్యా మడనూరు విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని రాజుపాలెం, ఈతముక్కల, వజ్జి రెడ్డి పల్లె, గమల్ల పాలెం గ్రామాలలో శనివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లుగా పేర్కొన్నారు.