విద్యుత్ లైన్లలో మరమ్మతుల కారణంగా మంగళవారం ఒంగోలు నగర పరిధిలోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లుగా విద్యుత్ శాఖ డీఈ పాండురంగారావు ఒక ప్రకటనలో తెలిపారు. భవానీ వీధి, పండరీపురం, నిర్మల్ నగర్ పార్క్, అంజయ్య రోడ్డు, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, బృందావన్ నగర్, సుందర్ నగర్ ప్రాంతాలలో ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లుగా పేర్కొన్నారు. సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు.