రైళ్లలో ఫుట్బోర్డు వద్ద నిలబడి ఫోన్లో మునిగిపోయే ప్రయాణికులపై కర్రలతో దాడి చేసి సెల్ ఫోన్లు అపహరిస్తున్న షేక్ రఫీ అనే యువకుడిని ఒంగోలు జీఆర్పీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.50 వేల విలువైన ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఒంగోలు, వేటపాలెం, అనకాపల్లిలో కూడా చోరీ కేసుల్లో అతనిపై రికార్డులు ఉన్నట్లు తెలిపారు.