యర్రగొండపాలెం నియోజకవర్గంలో 2022 నవంబర్ నుంచి 2023 మార్చి వరకు ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేసినందుకు గాను రూ.945.88 లక్షల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. బిల్లులు చెల్లించకపోవడంతో ట్యాంకర్ నిర్వాహకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.