త్రిపురాంతకం: సాగర్ కాలవలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం లోని సాగర్ కాలవలో శనివారం సాయంత్రం సమయంలో ఆత్మహత్య చేసుకునేందుకు కాలవలోకి దూకిన సుబ్బయ్య మృతదేహం ఎట్టకేలకు సోమవారం పోలీసులు గుర్తించారు. స్నేహితులతో కలిసి సుబ్బయ్య సరదాగా సాగర్ కాలువలోకి ఈతకు వెళ్ళాడు. ఆ సమయంలో అప్పు తీర్చమని స్నేహితులు నిలదీయడంతో మనస్థాపం చెందిన సుబ్బయ్య సాగర్ కాలవలోకి దూకి గల్లంతయ్యాడు. జరిగిన ఘటనపై పూర్తి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్