ప్రకాశం జిల్లా దర్శిలో శనివారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు నిర్వహించింది. స్థానిక మున్సిపల్ కమిషనర్ వై. మహేశ్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు కడప ఏసీబీ సీఐ రామకృష్ణ తెలిపారు. దాడుల్లో భాగంగా కొన్ని డాక్యుమెంట్లు, కొంత బంగారం, మరికొన్ని ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మహేశ్కు సంబంధించిన ఆదాయ వనరులపై అంచనా వేస్తూ దర్యాప్తు కొనసాగుతోందని సీఐ రామకృష్ణ తెలిపారు.