ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని వీరాయపాలెంలో శనివారం సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 10కి తాడేపల్లిలోంచి హెలికాప్టర్లో బయలుదేరి, 10.35కి దర్శి హెలిప్యాడ్కి చేరుకుంటారు. అనంతరం అన్నదాత సుఖీభవ ప్రారంభించి, రైతులతో సమావేశం నిర్వహిస్తారు.