మార్కాపురం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై శనివారం కంభం సర్కిల్ సీఐ మల్లికార్జున వాహనదారులకు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుందని సీఐ వాహనదారులను హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు మద్యం తాగకుండా వాహనాలు నడపాలని సూచించారు.