మార్కాపురం జిల్లా కొమరోలు మండలం పురుషోత్తమునిపల్లి గ్రామ పరిసరాలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న ప్రాంతాలను పోలీసులు శనివారం గుర్తించి, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శుభ్రం చేశారు. ఈ ప్రాంతాలపై నిఘా ఉంచుతామని, ఇకపై మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నాగరాజు మందుబాబులను హెచ్చరించారు.