గురువారం రాత్రి మార్కాపురం జిల్లా కంభం, బేస్తవారిపేట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు ఈదురు గాలుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పగటిపూట 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు సాయంత్రం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందారు.