ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ

ప్రకాశం జిల్లా కంభం మండలంలోని సూరేపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయ హుండీని పగలగొట్టి సుమారు రూ. 10 వేల నగదును అపహరించినట్లు ఆలయ అర్చకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్