మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం మొహిద్దిన్ పురం గ్రామంలో ఆదివారం పొలంలో పనిచేస్తున్న శివకుమారి అనే మహిళపై అడవిపంది దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను మొదట గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించారు. అటవీ ప్రాంతానికి పొలం దగ్గరగా ఉండటంతో అడవి పంది పొలంలోకి వచ్చినట్లుగా స్థానికులు తెలిపారు.