ఈ నెల 25న కందుకూరులో జరగనున్న తన కుమారుడి తొలి పుట్టినరోజు వేడుకకు రావాల్సిందిగా నెల్లూరుకు చెందిన మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కంచర్ల సుధాకర్ దంపతులు ఆహ్వానించారు. సుధాకర్ కుటుంబ సభ్యులతో కలిసి వెంకయ్యనాయుడు నివాసానికి స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు కంచర్ల సుధాకర్ దంపతులకు ముందుగానే శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.