ప్రకాశం జిల్లా కనిగిరిలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవి, డీబీవీ స్వామి పాల్గొన్నారు. 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్కు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవి మాట్లాడుతూ. అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వైసీపీ కుట్రలు, కుతంత్రాలతోనే పాలిస్తోందని, పల్నాడు, గుడివాడ ఘటనలు ఇందుకు నిదర్శనమన్నారు.