త్రిపురాంతకం మండలం దుపాడులోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో గురువారం మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ జరిగింది. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఇచ్చే రూ.13 వేలు కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని వైపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు తెలిపారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం విద్యార్థుల ఆరోగ్యానికి దోహదం చేస్తుందన్నారు.