మార్కాపురం జిల్లా కనిగిరిలోని శంఖవరంలో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఋతు చక్ర పరిశుభ్రత దినోత్సవ అవగాహన కార్యక్రమం జరిగింది. డిప్యూటీ హెచ్ఐవో ఎం. వి. విజయ భాస్కర్ మాట్లాడుతూ, మహిళల ఆరోగ్య రక్షణకు, సమాజంలో మహిళా సాధికారతకు ఋతు పరిశుభ్రత అత్యంత ముఖ్యమని, ఋతుస్రావం అనేది కేవలం సహజమైన జీవక్రియ మాత్రమేనని, దీనిపై ప్రతి ఒక్కరూ సరైన అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.