మార్కాపురం జిల్లా చంద్రశేఖరపురం మండలం మిట్టపాలెం గ్రామంలో సోమవారం రాత్రి వెంకట నారాయణ అనే రైతుకు చెందిన 8 గొర్రెలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ఉదయాన్నే గొర్రెలు కనిపించకపోవడంతో రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.