కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్, వైసీపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కనిగిరిలోని 14వ వార్డు కమిటీ నియామకంపై మంగళవారం పార్టీ నాయకులతో సమావేశమైన ఆయన, గత ఎన్నికల్లో క్షేత్రస్థాయి కమిటీల బలహీనతే ఓటమికి కారణమని పేర్కొన్నారు. ఆ తప్పులను పునరావృతం చేయకుండా పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.