సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరెళ్లేవారు తమ ఇళ్లకు తాళాలు వేసుకొని, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో లేదా సురక్షితమైన ప్రదేశాలలో భద్రపరచుకోవాలని కొండపి సీఐ సోమశేఖర్ శుక్రవారం సూచించారు. వీలైనంతవరకు ఇళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సాధ్యంకానివారు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయాలని ఆయన తెలిపారు. తాము పోలీసులను అప్రమత్తం చేసి రాత్రిపూట గస్తీని పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.