ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో ఆదివారం ఓ బావిలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహానికి బండరాయి కట్టి ఉండటంతో, ఇది అనుమానాస్పద మృతిగా భావించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.