ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మహిళలను కించపరిచిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ రాధాకృష్ణపై మార్కాపురంలో వైసిపి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం స్థానిక వైసీపీ ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు లేఖ అందజేశారు. మహిళల పట్ల అమర్యాదగా, ఉచితంగా వ్యవహరించిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని వైసిపి నాయకులు డిమాండ్ చేశారు.