మార్కాపురంలో మోస్తారు వర్షం

మార్కాపురంలో శుక్రవారం మధ్యాహ్నం మోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మబ్బుపట్టి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కురిసిన వర్షంతో వేడి నుంచి ఉపశమనం లభించింది. బంగాళాఖాతంలో అల్ప ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఈదురు గాలులు కూడా స్థానికంగా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్