మహానాడు సమావేశంలో AP సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు పునాది వేసింది తానేనని తెలిపారు. గత ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసినట్లు జగన్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ప్రాజెక్టు పూర్తి చేసి మార్కాపురం జిల్లాకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.