ఫిబ్రవరి 12న జరిగే కార్మిక సమ్మె జయప్రదం చేయాలి: నాసరయ్య

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్త కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక నేతలు పిలుపునిచ్చారు. మంగళవారం మార్కాపురం పూల సుబ్బయ్య శాంతి భవన్లో ఏఐటీయుసీ, సీఐటీయు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్మిక సమావేశంలో ఏఐటీయూసీ నాయకుడు నాసరయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన లేబర్ కోడ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్