మార్కాపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజిపి)గా తర్లుపాడుకు చెందిన న్యాయవాది వనపర్తి నాగేంద్ర రాజు నియమితులయ్యారు. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వానికి సంబంధించిన సివిల్ కేసులలో న్యాయ సలహాలు అందించడంతో పాటు, ప్రభుత్వం తరపున కోర్టులో వాదనలు వినిపించనున్నారు. పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.