మార్కాపురం జిల్లా పొదిలి మండలం తలమాలలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పిచ్చయ్య (45) పెళ్లి వేడుకకు హాజరై, తిరిగి ఇంటికి నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలవడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.