మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తాడివారిపల్లెలో మంగళవారం రాత్రి జరిగిన విషాద సంఘటనలో, నల్లబోతుల వెంకట స్వామికి చెందిన దొడ్డిలో ఉన్న 20 పొట్టేళ్లు కుక్కల దాడిలో మృతి చెందాయి. ఈ ఘటనతో రైతు వెంకట స్వామి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన పొట్టేళ్లకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు.