మార్కాపురం జిల్లా కేంద్రంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఇవాళ రాత్రి అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, రేపు ధ్వజారోహణంతో పాటు సూర్య వాహనం, 3వ తేదీన కళ్యాణం, చంద్ర వాహనం, 4న సింహ వాహనం, 5న శేష వాహనం, 6న వ్యాళి వాహనం, 7న పొన్న వాహనం, 8న హనుమంత వాహనం, 9న గరుడ వాహనం, 10న గజవాహనం, 11న రథోత్సవం, 12న అశ్వ వాహనం సేవలు నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలు భక్తుల సమక్షంలో వైభవంగా జరగనున్నాయి.