బారామతిలో జరిగిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. గురువారం బారామతికి చేరుకున్న ఎంపీ, అజిత్ పవార్ పార్థివ దేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాజకీయ రంగంలో అజిత్ పవార్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందాలని ఎంపీ మాగుంట కొనియాడారు.