ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మద్యం తాగి ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు నడుపుతున్న పదిమందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని పోలీసు అధికారులు వాహనదారులను హెచ్చరించారు.