ఒంగోలు పట్టణంలో 15 ఏళ్లుగా నివాసం ఉంటున్న తన షాపులను అధికారులు కూల్చివేశారని మరియమ్మ అనే మహిళ ఆరోపించారు. కోర్టులో వివాదం ఉన్నప్పటికీ, అధికారులు అత్యుత్సాహంతో తన దుకాణాలను ధ్వంసం చేశారని ఆమె వాపోయారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వద్దకు వెళ్తున్నానని చెప్పినందుకే ఇలా చేశారని ఓ మహిళా కార్యకర్త అన్నట్లు ఆమె మీడియాకు తెలిపారు. ఈ సంఘటనపై మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.