ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం పెళ్లూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున లారీ డ్రైవర్ సెల్వరాజ్ను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బెదిరించి, అతని వద్ద ఉన్న రూ. 2000 నగదు, మొబైల్ ఫోన్ను దోచుకున్నారు. చెన్నైకి వెళ్తుండగా మూత్ర విసర్జన కోసం రోడ్డు పక్కన లారీ ఆపినప్పుడు ఈ ఘటన జరిగింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.