ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దివంగత నేత మాగుంట సుబ్బిరామిరెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై మాట్లాడుతూ, తన స్థానంలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని తదుపరి ఎన్నికలలో పోటీ చేసేందుకు సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు.