ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తికి గాయాలు

ఒంగోలులోని హైదరీ క్లబ్ వద్ద బుధవారం ఓ వ్యక్తి బైక్ అదుపుతప్పి బోల్తా పడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతన్ని వైద్యశాలకు తరలించారు. కొందరు అతను పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి వెళ్ళాడని తెలుపుతుండగా, మరికొందరు మద్యం సేవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్