ప్రకాశం జిల్లాలోని పంగులూరు మండలం రేణిగవరం జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.