ఒంగోలు: బాలికతో అసభ్యం.. 20 ఏళ్ల జైలు శిక్ష.!

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, పదివేల జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు గురువారం తీర్పునిచ్చింది. సింగరాయకొండకు చెందిన హరి అనే వ్యక్తి, ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరుపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 2019 జనవరి 14న కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరు పరచగా శిక్ష ఖరారు చేశారు. సంబంధిత పోలీసులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు.

సంబంధిత పోస్ట్