శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, జరిమానా విధించారు. అంతేకాకుండా, వారు మద్యం సేవిస్తున్న ప్రాంతాలను వారితోనే శుభ్రం చేయించి, మళ్లీ ఇలాంటి తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.