ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలీసులు శనివారం రాత్రి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ రహదారులపై వాహన తనిఖీలు చేసి, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనం నడిపితే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష పడుతుందని పోలీసులు హెచ్చరించారు.