ఒంగోలు నగరంలో కొప్పోలు, చింతల ప్రాంతాల్లో టిడ్కో గృహ నిర్మాణ పనులు ఆదివారం ఎమ్మెల్యే దామచర్ల, అధికారుల పరిశీలనతో పునఃప్రారంభమయ్యాయి. మొదటి విడతలో 3792 ఇళ్లను పేదలకు అందజేస్తామని తెలిపారు. కొప్పోలులో 2736 ఇళ్లు 75% పూర్తి కాగా, చింతలలో 1392 ఇళ్లు 61% పూర్తయ్యాయని చెప్పారు. దసరా నాటికి ఇళ్లను అందజేస్తామని అధికారులు వెల్లడించారు.