ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని జిల్లా పరిషత్ స్కూల్ విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి వెంకారెడ్డి బుధవారం విమాన ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు. ఓ ఫౌండేషన్ సహకారంతో, పదో తరగతిలో ప్రథమ స్థానంలో నిలిచిన తొమ్మిది మంది విద్యార్థులను విజయవాడ నుండి హైదరాబాద్ వరకు విమానంలో పంపారు. ఈ అపూర్వ అనుభవం విద్యార్థులలో ఆనందాన్ని నింపింది.