మార్కాపురం జిల్లా దోర్నాల సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత పులి సంచారం కలకలం రేపింది. సమీప పొలాల్లో చిరుతను చూసిన రైతు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు డ్రోన్ సహాయంతో గాలింపు చేపట్టగా, చిరుత ఆనవాళ్లు లభించలేదు. దీంతో అటవీ అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, చిరుత కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాలని అటవీ అధికారులు సూచించారు.