AP: ఇమామ్ బాషా ఆత్మహత్యాయత్నంపై టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక టీడీపీ నేత రఫీకి, ఇమామ్ బాషాకు విభేదాలు ఉన్నాయని, ఎమోషన్లో ఇమామ్ ఆత్మహత్యాయత్నం చేశారని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయనని, గతంలో ఇమామ్కు గుండె ఆపరేషన్ కూడా తామే చేయించామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇమామ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు.